19-06-2025 01:22:00 AM
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాస స్వామి యాదవ్
నిజామాబాద్ జూన్ 18: (విజయక్రాంతి): దేశంలో పేదరికం నిర్మూలించి భారతీయులందరినీ సర్వతో ముఖాభివృద్ధి కోసమే 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము నిర్విరామంగా కృషి చేస్తున్నదని బీజేవైఎం అధికార ప్రతినిధి స్వామి యాదవ్ అన్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన పథకాల ద్వారా సామాన్య ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడం కోసం కృషి చేస్తున్నదని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారత ప్రజలందరూ తమ యొక్క మద్దతును తెలుపుతున్నట్టు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ అన్నారు.
ఓబిసి మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు 48వ డివిజన్ ఎల్లమ్మ తల్లి మండలంలోని బీడీ ప్యాకింగ్ కార్మికులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతో మంది కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరుతున్నదని ప్రజలు మరింత అవగాహన పెంచుకొని అర్హత కలిగిన అన్ని పథకాలకు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మెట్టు విజయ్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు పడాల భూపతి, రామచందర్ ,బంగారు శ్రీనివాస్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.