12 June, 2026 | 2:19 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు పర్యవేక్షణ

12-02-2026 02:27 AM

మరిపెడ, ఫిబ్రవరి 11(విజయక్రాంతి)జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మరిపెడ మున్సిపల్ పట్టణంలో ఏర్పాటు చేసిన వార్డుల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ స్వయంగా సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన పటిష్ట పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పోలింగ్ అధికారులతో, సిబ్బందితో మాట్లాడి అక్కడున్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మాట్లాడుతూ ఎన్నికల వేళ భద్రతా వ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

న్నికల నిర్వహణలో పాల్గొంటున్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.శాంతియుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు పోలీసులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ స్పష్టం చేశారు.ఈ పర్యవేక్షణలో ఏ ఆర్ డి ఎస్ పి విజయ్ ,మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్, మరిపెడ సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్ర రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.