12-06-2025 01:13:48 AM
- రోజుకు రూ. 5-6 లక్షల వ్యయం
- పేదరికంతో సతమతమవుతున్న తల్లిదండ్రులు
- దాతల కోసం తులసి దంపతుల ఎదురుచూపు
హైదరాబాద్, జూన్ 11(విజయ క్రాంతి): గుండె జబ్బుతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న 11 నెలల పసికందు మోక్షిత్కు సహాయం కోసం అతని తల్లి తులసి, తండ్రి గజర్ల నాగరాజు దంపతులు దాతలను, మానవతావాదులను మీడియా ద్వా రా వేడుకుంటున్నారు. తమ చిన్నారి ప్రాణం నిలబెట్టడానికి రోజుకు లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వైద్య చికిత్స అవసరమని, తమకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యారు.
కూకట్పల్లిలోని అంకుర్ హాస్పిటల్స్లో మోక్షిత్ ప్రస్తు తం కార్డియో ఈసీఎంఓ యం త్రం సహాయంతో చికిత్స పొందుతున్నాడు. ఈ వైద్యం అత్యంత ఖరీదైనదని, రోజుకు సుమారు రూ. 5 నుండి 6 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యు లు తెలిపారు. సాధారణ మధ్యతరగతి, నిరు పేద కుటుంబానికి చెందిన తులసి దంపతులకు ఈ భారీ మొత్తాన్ని భరించడం అసాధ్యంగా మారింది. నా బిడ్డకు గుండె జబ్బు అని తెలియగానే మా గుండె ఆగిపోయినంత పనైంది. డాక్టర్లు ఈసీఎంఓ పెట్టాలని, రోజుకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పా రు.
మాకు అంత డబ్బు లేదు. ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం. నా మోక్షిత్ ప్రాణం నిలబెట్టాలంటే దాతల సహా యం తప్ప మరో మార్గం లేదు,” అని మోక్షిత్ తల్లి తులసి కన్నీళ్లతో అభ్యర్థించారు. మోక్షిత్ ప్రాణాన్ని కాపాడటా నికి మీ సహాయం అత్యవసరం. దయచేసి, మీ సహాయం అం దించడానికి ముందుకు రండి. మీ చిన్న సహాయం కూడా మోక్షిత్ జీవితాన్ని నిలబెట్టగలదు. వివరాలకు 7799499191కు సంప్రదించాలని కోరారు.