12-06-2025 01:12:21 AM
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
కామారెడ్డి, జూన్ 11 (విజయ క్రాంతి){ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణం చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయం ఆవరణలో మొక్క లు నాటారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశాన్ని సస్యశ్యామల దేశంగా తీర్చి దిద్దుతున్న వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు.
11 సంవత్సరాలుగా దేశాన్ని అన్ని రంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందుకుంటున్నాయని అన్నారు. దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడమే కాకుండా రామజన్మ భూమిని నిర్మించాడని పేర్కొన్నారు.
దేశంలోని అన్ని గ్రామాలకు 90% నిధులను మంజూరు చేసి రోడ్లను వేయడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం కి చరమగీతం పాడి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న 22 వేల మంది భారతీయులను మోడీ భారతదేశానికి తీసుకువచ్చారన్నారు.
ప్రతి రంగానికి నిధులను మంజూరు చేస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి దేశానికి దొరకడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. ఈ సమావేశంలో కామరెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.