11-06-2025 06:42:56 PM
భైంసా (విజయక్రాంతి): భైంసా జూనియర్ సివిల్ కోర్టులో ఈనెల 14న లోక్ అదాలత్(Lok Adalat) నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తి దేవేంద్రబాబు(Judge Devendra Babu) తెలిపారు. కార్యక్రమం ప్రచారంలో భాగంగా బుధవారం కోర్టు సిబ్బంది చంద్రకాంత్ పట్టణంలోని బ్యాంకులు, ఆర్డీవో, తాసిల్దార్, మున్సిపల్, ఆర్టీసీ బస్టాండ్, ఆసుపత్రులు, ప్రభుత్వ ప్రజాసంచార స్థలాల వద్ద లోక్ అదాలత్ పోస్టర్లను అతికించి అవగాహన కల్పించారు.