20 March, 2026 | 10:51 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

బావిలో దూకి తల్లీకొడుకు ఆత్మహత్య

16-04-2025 02:03 AM

చిలుకూరు,ఏప్రిల్ 15;  బావిలో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలుకూరు మండలంలోని కొత్త కొండాపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుడిగం వీరమ్మ (70)కు దివ్యాంగ కుమారుడు నాగేశ్వరరావు (44) ఉన్నాడు. దివ్యాంగ కుమారుడి బాగోగులను వీరమ్మ స్వయంగా చూసుకుంటుంది. గత కొంతకాలంగా వీరమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నది.

తనకు ఏమైనా జరిగితే దివ్యాంగ కుమారుడు నాగేశ్వరరావు బాగోగులు చూసేవారు ఉండరనే ఆందోళనతో ఇద్దరు కలిసి సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయిన తర్వాత గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్త్స్ర సురభి రాంబాబు మృతదేహాలను పరిశీలించి పంచనామా నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.