07-06-2025 06:14:30 PM
కామారెడ్డి (విజయక్రాంతి): బిడ్డతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి(Kamareddy) మండలంలోని నరసనపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... నరసన్నపల్లి గ్రామానికి చెందిన రాచమొల్ల స్రవంతి(24) శుక్రవారం సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి తన నాలుగేళ్ల కొడుకు రుద్రేశ్, ఏడేళ్ల కూతురు శ్రీవల్లితో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది చిన్న మల్లారెడ్డి గ్రామ చెరువు వద్దకు రాగానే కూతురు తప్పించుకుని పారిపోయింది. నాలుగేళ్ల కొడుకును చెరువులో తోసేసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వారి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చరికి తరలించారు. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.