07-06-2025 06:12:36 PM
కామారెడ్డి (విజయక్రాంతి): భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురైన ఓ భర్త ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మదాం సంజీవ్ (34) డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే భార్య భర్తల మధ్య గొడవతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమె కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందిన సంజీవ్ శుక్రవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.