ముత్తారం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుని మాతృమూర్తి మృతి
పరామర్శించి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం, కాంగ్రెస్ నాయకులు
ముత్తారం, జూన్ 26(విజయక్రాంతి): ముత్తారం గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు కోల విజయకుమార్ మాతృమూర్తి శుక్రవారం ఉదయం అకాల మరణం చెందారు. ఆమె మరణవార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం విజయకుమార్ నివాసానికి చేరుకుని, పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాతృవియోగంతో బాధపడుతున్న విజయకుమార్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కఠిన సమయంలో పార్టీ కార్యకర్తలందరూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బుచ్చంరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూనెటి కృష్ణ యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొని సంతాపం తెలియజేశారు.






