15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

01-11-2025 08:23 PM

ఎస్సై గోపతి సురేష్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎస్సై గోపతి సురేష్ అన్నారు. శనివారం పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ... వాహనాలు నడిపే సమయంలో వాహన పత్రాలైన ఆర్సితో పాటు ఇన్సూరెన్స్, పొల్యూషన్ లైసెన్స్ తప్పకుండా వెంట ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలన్నారు. వాహనాలను వేగంగా నడపకూడదని ఆటో డ్రైవర్లు పరిమితికి మించి వాహనాల్లో ప్యాసింజర్లను ఎక్కించుకోకూడదని ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్సై రామయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.