15 June, 2026 | 10:37 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రైతుని పలకరించి.. ధాన్యం రాశిపోసి..

01-11-2025 08:25 PM

టేకుమట్ల వద్ద ధాన్యం ఆరబెడుతున్న రైతుని పలకరించిన జిల్లా ఎస్పీ నరసింహ 

సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట రూరల్ పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్ద జాతీయరహదారిపై బ్లాక్ స్పాట్స్ ను, రోడ్డు ప్రమాద స్థలాలు, భద్రత చర్యలను పరిశీలించడానికి వచ్చిన జిల్లా ఎస్పీ నరసింహ రైతులను పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు వ్యవసాయంలో మంచి రకమైన ధాన్యాన్ని ఎంచుకుని మంచి దిగుమతి పొందాలనీ సూచించారు. విత్తనాల కొనుగోలు, ధాన్యం అమ్మకాల విషయంలో ఎక్కడ కూడా దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. తదుపరి వారితో కలిసి ధ్యానంను రాశిపోశారు. ఈయన వెంట డీ ఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్సై బాలు నాయక్ సిబ్బంది ఉన్నారు.