04-06-2025 01:04:34 AM
- సనత్నగర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోట నీలిమ
- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ‘తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం సాగిన తెలంగాణ ఉద్యమం సాగిందని సనత్నగర్ కాంగ్రెస్ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి, వారి అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు.
తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోట నీలిమ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాలు, కార్యకర్తలు, సైక్లింగ్ అభిమానులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బేగంపేట్ విమానాశ్రయ రోడ్డులో ప్రారంభమై రసూల్పుర సర్కిల్ వరకు సాగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన కోట నీలిమ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయం కో సం జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చే స్తూ, ఆ ఉద్యమం ఆవిర్భావ స్ఫూర్తిని మర లా ప్రజల్లో కలిగించే ఉద్దేశంతో ర్యాలీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభు త్వం తెలంగాణ ప్రజలకు శ్రేయస్సు అందిం చే దిశగా పయనిస్తున్నదని పేర్కొన్నారు.