04-06-2025 01:04:28 AM
ఖైరతాబాద్, జూన్ 3: ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో అనుమానిత ఫుడ్ పాయిజన్తో ఒకరు మృతిచెందగా, దాదాపు 70 మంది అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం తీవ్ర కలకలం లేపింది. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న దాదాపు 71 మంది సోమవారం భోజనం అనంతరం వాంతులు, డయేరియా వంటి లక్షణాలో ఇబ్బందిపడ్డారు.
వా రిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో కరణ్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందగా, 68 మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆర్ఎంఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫుడ్ పాయిజన్కు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దిశెట్టి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంహెచ్ఓ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. భోజనం శాంపిల్స్ని ల్యా బ్కు పంపించారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా ఉస్మానియాలో ప్రత్యేక వైద్య బృందం బాధితులకు చికిత్స అందిస్తోంది.