17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అంబేద్కర్ ఆశయాలతో ముందుకు

15-04-2025 12:00 AM

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేస్తుంది

రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి

అంబేద్కర్ అందరివాడు.. కొందరివాడుకాదు: మాజీఎం బూర నర్సయ్యగౌడ్

అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్14: దేశంలోగానీ.. రాష్ట్రంలోగానీ డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి అన్నారు. సోమవారం పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధి తట్టి అన్నారం అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు నల్ల ప్రభాకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన మల్‌రెడ్డి రాం రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలకు మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేసిందన్నారు.  అదే విధంగా తెలంగాణలో ఏబీసీడీ వర్గీకరణ చేశామన్నారు.

అంబేద్కర్ అందరివాడు..

భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేథావి అని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నాడు. రాజ్యాంగం ఒక వర్గానికో.. ఒక్క మతానికో.. అంబేద్కర్ పరిమితం కాదన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదు.. అందరివాడు... ఆయన అందించిన స్ఫూర్తి ప్రతి ఒక్కరం ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మద్ది శ్రీధర్‌రెడ్డి, సాదుల శ్రీనివాస్, భాస్కర్, నాయకులు దేవిడి వేణుగోపాల్‌రెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, రావుల గోపాల్, సీపీఎం నాయకులు ఏర్పుల నర్సింహా, నాగోల్ ఇన్‌స్పెక్టర్ సూర్యనాయక్, సబ్ ఇన్‌స్పెక్టర్ రమేశ్, యువజన నాయకులు నల్ల శివకుమార్, సుక్క రవి, నగేశ్, నల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.