కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి
మహబూబ్నగర్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వ దిస్తే మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తానని మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి మిడ్జిల్ మండల పరిధిలోని బైరంపల్లి కంచన్పల్లి, సింగందొడ్డి, డోనూర్ గ్రామాల్లో గురువారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి క్షణం పరితపిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రచారంలో ఆయా గ్రామాల కార్య కర్తలు, నాయకులు పాల్గొన్నారు.