15-06-2025 12:19:06 AM
మేడ్చల్ అర్బన్: పిస్తా హౌస్ యొక్క 56వ బ్రాంచ్ మేడ్చల్ పట్టణంలోని చెక్ పోస్టులో ఘనంగా శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender), ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy), కాంగ్రెస్ పార్టీ నాయకుడు వజ్రెష్ యాదవ్ లు రిబన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పిస్తా హౌస్ నిర్వాహకులు కిరణ్ రెడ్డి, సందీప్ రెడ్డి, శ్రీనివాసరావు దేశముఖ్, మాధవరెడ్డిలు ముఖ్య అతిధులను శాలువాతో సత్కరించి పూల గుచ్చం అందజేశారు. పిస్తా హౌస్ దినదినాభివృద్ధి చెందుతూ, ఆహార ప్రియులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలని ముఖ్య అతిధులు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వజ్రేశ్ యాదవ్ కోరారు.