15-06-2025 12:20:57 AM
రాజేంద్రనగర్: భవనం పై నుంచి కిందపడి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. ఆషారం సాహూ(27) అనే కార్మికుడు అత్తాపూర్ లోని ఓ భవనంపై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.