calender_icon.png 15 June, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన కార్యవర్గాన్ని సత్కరించిన ఎంపీ ఈటల రాజేందర్

14-06-2025 12:00:00 AM

ఘట్ కేసర్, జూన్ 13 : భారతీయ జనతా పార్టీ పోచారం మున్సిపల్ నూతన కార్యవర్గ సభ్యులని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రా జేందర్ శాలువాలతో సత్కరించారు. శుక్రవారం బిజెపి పోచారం మున్సిప ల్ అధ్యక్షులు ననావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీ ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన నూతన కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎంపి వారిని శాలువాతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు బొద్ది శ్రీనివాస్, మరియు జిల్లా మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జాతీయ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు బిక్కు నాయక్, మాజీ కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్, డిటి నాయక్, గొంగళ్ల బాలేష్, గొంగళ్ల రాజా రమేష్ మరియు పోచారం మున్సిపల్ ఉపాధ్యక్షులు మేకల చంద్రిక రెడ్డి, వరికుప్పల యాదగిరి, మంకోజు కనక చారి, గొరిగే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు సాయిరాజ్ నాయక్, కోన మల్లేష్, రేతి వెంకటేష్, కార్యదర్శులు గంజి వంశీ కుమార్, ఇటుకల సరిత, నూతన్ మిశ్ర, బండారు రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.