3 May, 2026 | 9:53 PM

సీఎం సహాయ నిధికి ఎంపీ మల్లు రవి ఒక నెల వేతనం

06-09-2024 12:49 AM

హైదరాబాద్,సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : రాష్ట్రంలో భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న రాష్ట్రంలోని బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ఒక నెల వేతనం రూ. 1 లక్షా 90 వేలను విరాళంగా అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు స్పందించిన ఆయన ఎంపీ నెల వేతనానికి సంబంధించిన చెక్‌ను ఇచ్చారు.