21-06-2025 06:55:20 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిజాంబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించి రాష్ట్ర మహాసభలకు నిర్మల్ నుంచి బీడీ కార్మికులు(Beedi workers) పెద్దఎత్తున తరలి వెళ్లారు. ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాజన్న ఆధ్వర్యంలో ప్రత్యేక కార్మికుల తరలి వెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్ లక్ష్మణ్ గంగన్న గఫూర్ లక్ష్మీ గంగామణి పోసాని తదితరులు పాల్గొన్నారు.