24-06-2025 12:54:50 AM
రూ.45 కోట్లతో రైల్వే అండర్ బ్రిడ్జికి నిధులు మంజూరు
చేగుంట, జూన్ 23 : చేగుంట నుండి మెదక్ కు వెళ్లాలంటే చేగుంట పట్టణ కేంద్రంలో ఉన్న రైల్వే గేట్ దగ్గర గంటలకు కొద్ది ఆగవాల్సిందే. దీంతో పట్టణ ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. 2023 ఎన్నికల్లో ఎంపీ రఘనందన్ రావు ఎన్నికల్లో గెలిచినా తరువాత రైల్వే బ్రిడ్జి నిర్మిస్తానని అప్పట్లో వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ రైల్వే అండర్ బ్రిడ్జి కోసం నిధులు మంజూరు చేశారు.
సోమవారం ఆయన చేగుంటలో విలేకరులతో మాట్లాడుతూ.. రూ.45 కోట్లతో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణనికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, టెండర్ ప్రక్రియ పూర్తయిందని త్వరలో పనులు ప్రారంభించి 18 నెలలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అనంతరం వడియారం గ్రామంలో దుబ్బాక బిజెపి కో కన్వీనర్ గోవింద్ తండ్రి మరణవార్త తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు భూపాల్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్ రవికుమార్,నర్సింగ్ మండల అధ్యక్షుడు షిర్నా చంద్రశేఖర్ మండల ప్రధాన కార్యదర్శులు కుమ్మరి నర్సింలు,జూకంటి శోభన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్,సీనియర్ నాయకులు రఘువీర రావ్, నాగభూషణం, దాసు, సాయిప్రసాద్, సాయిబాబా సురేష్, రతన్ సింగ్ తదితరులుపాల్గొన్నారు.