24-06-2025 12:53:51 AM
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, జూన్ 23(విజయక్రాంతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్, మాధురి, డి ఆర్ ఓ పద్మజ రాణిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
అధికారులు జవాబుదారీగా పని చేయాలి : కలెక్టర్ రాహుల్రాజ్
అధికారులు జవాబీదారుగా విధులు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ నగేష్ , జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుండి ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 119 దరఖాస్తు వచ్చాయని, వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.