క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీడీవో వెంకట ప్రసాద్
ధర్మపురి,ఫిబ్రవరి25 (విజయక్రాంతి): వెల్గటూర్ ఉమ్మడి మండల టోర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనుగొటి శ్రీనివాసరావు సహకారంతో స్థానిక సర్పంచ్ బండమీది కవిత గోపి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వెంకట ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి రెండు బహుమతులు బండారి రాజేందర్ రూ.8000, 5000 లుగా అందజేయనున్నారు.
5000 విలువ చేసే ట్రోఫీలను @మెమెంటోలు మెరుగు నరేష్ గౌడ్ అందజేస్తారు. మొదటి మ్యాచ్ కొండాపూర్, గుల్లకోట మధ్య జరుగగా గుల్లకోట మొదటి విజయం సాధించింది దీనికి ఆర్గనైజర్గా వడకపురం రాజు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బి.రామస్వామి, గుమ్ముల సతీష్, సాగవని శ్రీనివాస్, గోపతి నరేష్, బారుపటి అజయ్, మెరుగు సంజయ్, తరల్ల నవీన్, పత్తిపాక సురేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు




