17-06-2025 02:20:35 PM
హైదరాబాద్: గోదావరి-బనకచర్లపై రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సచివాలయంలో ఎంపీల సమావేశం జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఎంపీల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర బొగ్గు గణులశాఖ మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా ఆహ్వానించామని, బనకచర్లపై ఎంపీలు సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కోరారు. తదుపరి కార్యాచరణపై తెలంగాణ ప్రభుత్వం ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది.
అలాగే బనకచర్లపై ఢిల్లీలో పర్యావరణ మంత్రిత్వశాఖ ఈఏసీ(Telangana Environment Ministry EAC) సమావేశమై బనకచర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల(Banakacherla Project Environmental Clearance) అంశంపై చర్చిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పర్యావరణ అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడంతో తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పందించింది. ఎలాంటి అనుమతులు లేకుండా బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోందని ఇరిగేషన్ శాఖ కేంద్రానికి లేఖ రాసిందన్నారు. అనుమతులు ఇవ్వొద్దని తెలంగాణ ఇరిగేషన్ శాఖతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లేఖ రాసినట్లు స్పష్టం చేశారు.