Mrigasira Karthi 2026: కిటకిటలాడుతున్న చేపల మార్కెట్లు
హైదరాబాద్: చేపల మార్కెట్లపై మృగశిర కార్తి(Mrigasira Karthi-2026) ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ముషీరాబాద్ చేపల మార్కెట్కు(Musheerabad Fish Market) ఆదివారం భారీ సంఖ్యలో కొనుగోలుదారులు తరలివచ్చారు. మృగశిర కార్తి సోమవారం రావడం, దానికి తోడు వారాంతం కూడా తోడవడంతో చేపలకు డిమాండ్ మరింత పెరిగిపోయింది. దీంతో సముద్రపు ఆహార ప్రియులు(Seafood lovers) పెద్ద సంఖ్యలో మార్కెట్కు తరలిరావడంతో భారీ రద్దీ ఏర్పడింది. ముషీరాబాద్ చేపల మార్కెట్ కిటకిట లాడుతోంది. సోమవారం తెల్లవారుజాము 2 గంటల నుంచే చేపల విక్రయాలు ప్రారంభమయ్యాయని విక్రేతలు తెలిపారు. మోసాలకు చెక్ పెట్టేందుకు చేపల మార్కెట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. తప్పుడు తూనికలతో చేపలు అమ్ముతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు.
పెరిగిన వినియోగదారుల అవసరాలను తీర్చడానికి, చేపల వ్యాపారులు రామ్నగర్ క్రాస్రోడ్స్ నుండి దయారా మార్కెట్ రోడ్ వరకు బారులు తీరారు. డిమాండ్ పెరగడంతో చేపల ధరలు పెరిగాయి. సాధారణంగా కిలో రూ.120-130 చొప్పున అమ్ముడయ్యే రవ్వ, బొచ్చె రకాలు కిలో రూ.230-250 చొప్పున అమ్ముడుపోయాయి. సాధారణంగా కిలో సుమారు రూ.450 ధర పలికే కొరమీను, ఆదివారం నాడు కిలో రూ.650 వరకు అమ్ముడైంది. మృగశిర కార్తి సమయంలో చాలా మంది సంప్రదాయం ప్రకారం చేపలను తింటారు కాబట్టి డిమాండ్ అత్యధికంగా ఉందని, దీనివల్ల రోజంతా అమ్మకాలు జోరుగా సాగాయని విక్రేతలు చెబుతున్నారు. మృగశిర కార్తి చేపలు తినాలని పెద్దల ముచ్చట. మెయిన్ మార్కెట్లే కాకుండా చేపలు అమ్ముతున్న చేపల కోసం భారీగా సీ ఫుడ్ ప్రియులు గుమిగూడారు.






