ముంబైపై పంజాబ్
దంచికొట్టిన ప్రభ్ సిమ్రన్, శ్రేయాస్
టాప్ లేపిన పంజాబ్ కింగ్స్
ఇది కదా ఆటంటే... ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఆటతీరు చూసాక ఈ మాట అనక తప్పదు. ప్రత్యర్థి ఎవరైనా దుమ్మురేపుతూ జైత్రయాత్ర కొొనసాగిస్తోంది. కింగ్ ఎక్కడైనా కింగ్ అన్నట్టుగా ఏ గ్రౌండ్లో ఆడినా చెలరేగిపోతోంది. తాజాగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసం సృష్టించిన వేళ టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది.
ముంబై, ఏప్రిల్ 16: ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసి ముంబైని ఒత్తిడిలోకి నెట్టొచ్చు అనుకున్న పంజాబ్ వ్యూహం ఆరంభంలో వర్కౌట్ అయింది. కేవలం 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
రికెల్టన్ (2), సూర్యకుమార్ యాదవ్ (0) ఔటవడంతో ముంబై కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన క్వింటన్ డిాకాక్ రెచ్చిపోయాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడు తూ స్కోరు పెంచాడు. అతనికి తోడు గా నమన్ ధీర్ కూడా చెలరేగిపోవడంతో ముంబై ఇన్నింగ్స్ పుంజు కుంది. వీరిద్దరూ మూడో వికెట్ కు కేవలం 68 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు.
నమన్ ధీర్ 31 బంతుల్లో 50(3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. డికాక్ దూకుడుగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చివర్లో ముంబై వేగం గా వికెట్లు చేజార్చుకుంది. హార్థిక్ (14), రూథర్ ఫర్డ్ (1), తిలక్ వర్మ ( 8) పరుగులకే వెనుదిరిగారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా డికాక్ (112) మాత్రం చివరి వరకూ క్రీజులో నిలిచాడు. చివర్లో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముం బై స్కోరు 195 పరుగులే చేయగలిగింది.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, యెన్సన్ 1, శశాంక్ 1 వికెట్ తీశారు. 196 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ కూడా తడబడింది. 45 పరు గులకే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(15), కూపర్ కన్నోలి(17) పరుగులకే ఔటయ్యారు. ఈ దశలో ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టారు. ముఖ్యంగా శ్రేయాస్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. అటు ప్రభ్ సిమ్రన్ సింగ్ భారీ సిక్సర్లతో వారిపై విరుచుకుపడ్డాడు. బుమ్రాతో సహా ఏ ఒక్క ముంబై బౌలర్ను వదలకుండా ఉతికారేశాడు.
ఫలితంగా మ్యాచ్ ఏకపక్షం గా మారిపోయింది. వీరిద్దరూ 69 బంతుల్లోనే 133 పరుగులు జోడిం చారు. శ్రేయాస్ 35 బంతు ల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రేయాస్ ఔటైనా ప్రభ్ సిమ్రన్ తన దూ కుడు కొనసాగిస్తూ స్టోయినిస్ తో కలిసి మ్యాచ్ ను ముగించాడు. దీంతో పంజాబ్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 39 బం తుల్లో 80 ( 11 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు.
స్కోరు బోర్డు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 195/6 ( డికాక్ 112 నాటౌట్, నమన్ ధీర్ 50 ; అర్షదీప్ సింగ్ 3/22, శశాంక్ సింగ్ 1/19)
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 198/3 ( ప్రభ్సిమ్రన్ 80, శ్రేయాస్ 66; ఘజన్ఫర్ 2/31)






