13-06-2025 12:00:00 AM
ప్రజాప్రతినిధులే లబ్ధిదారులా?
నిమిత్తమాత్రంగా అధికారులు...
బెల్లంపల్లి అర్బన్, జూన్12: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పైరవీలకు కేంద్రంగా మారింది. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ గృహాలు మంజూరు జరగాలి, కానీ నిబంధనలకు విరుద్ధంగా అర్హుల స్థానంలో అస్మధీయులను చేర్చి ఇందిరమ్మ జాబితాలో చోటు కల్పిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లక్ష కొట్టు ఇం దిరమ్మ ఇల్లు కట్టు అన్న రీతిలో నాయకుల తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నా యి.ప్రతి పేదవాడికి ఇల్లు సౌలభ్యం లక్ష్యం గా కాంగ్రెస్ ప్రభుత్వం గృహ నిర్మాణ పథ కం అమలులో ముందడుగు వేస్తుంది.
ప్రతి నియోజక వర్గానికి 3,500 గృహాలను మం జూరు చేసింది. ప్రతి వార్డులో 26 మంది చొప్పున ప్రస్తుతం తొలి విడుతన ఇల్లు మం జూరు అయ్యాయి. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా కమిటీలు వేశారు. వీటి ఆధ్వర్యంలోనే ఎంపిక పారదర్శకంగా జరగాలి. కానీ నిబంధనలకు పారదర్శకతకు కంచే చేను వేసిన చందంగా ఈ కమిటీలే లబ్ధిదారుల ఎంపికలో తప్పటడుగులు చేస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఇందిర మ్మ గృహాల మంజూరుపై పైరవీలు జోరు గా చుట్టుముట్టాయి. పరివీకారుల కనుసన్నల్లోనే ఇందిర మ్మ జాబితా లిస్టు తయారవుతుంది.
కొందరు కాంగ్రెస్ నాయకులు తమకు నచ్చిన వ్యక్తుల పేర్లు ఇందిరమ్మ గృహాల మంజూరు లిస్టులో చేరుస్తున్నారు. ఈ క్రమంలో అర్హులైన లబ్ధిదారుల పేర్లు జాబితాలో తలకిం దులు అవుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు మం జూరుకు రూ. 50 నుంచి లక్ష వరకు ముడుపులు తీసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్త మవుతున్నాయి. పైసలిస్తేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు లిస్టులో పేరు ఉంటది. బెల్లంప ల్లి, తాండూరు, నెన్నెల, కన్నెపల్లి, వేమనపల్లి, కాసిపేట, భీమిని మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవినీతి తంతే రాజ్యమేలుతుందనే విమర్శలున్నాయి.
నిమిత్తమాత్రంగా అధికారులు..
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కమిటీలకు అప్పగించడం వల్ల అధికారులు ఈ తంతుకు దూరంగా ఉన్నారు. లబ్ధిదారుల ఎంపికలో న్యాయ నిర్ణేత లు కావడంతో అధికారులు నిమిత్తమాత్రంగా మిగిలిపోయా రు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కొందరు అధికార పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అవకతవకల కు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు గమనించీ కూడా ఏమి చేయలేక పోతున్నారు.
అధికార పార్టీ నాయకులు కాబట్టి జాబితా తయారీలో తప్పులు దొర్లినా అధికారులు మిన్నకుండిపోతున్నారు. అధికా రం, పలుకుబడి ముందు అధికారులు అచేతనులుగా మారక తప్పలేదు. ఏమీ అనలేక చోద్యం చూడటమే వారి వంతయింది. జాబితా తయారీ నేపథ్యంలో నాలుగు పైస లు వెనుక వేసుకోవడానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. కొందరు నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులతో బేరసారాలకి ఒప్పందాలు సైతం చేసుకుంటున్నారు.
లీడర్లే లబ్ధిదారులు..
మొదటి విడతగా మంజూరైన ఇందిర మ్మ ఇళ్లలో పేదలకు అరకొరగా ఇల్లు మం జూరవుతున్నాయి. సన్యాసుల జోలెలను గుంజుకున్నట్టు లబ్ధిదారులను కాలదన్ని వారి ఇళ్లను ప్రతి వార్డులో మాజీ ప్రజా ప్రతినిధులు కొల్లగొట్టడంపై దుమారం లేచింది. ప్రతి మండలంలో ఇలాంటి సంఘటనలే చర్చనీయాశంగా మారాయి. పేదలకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇళ్ళను క్షేత్రస్థాయి లీడర్లే కాజేయడం పట్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లీడర్ల అవినీతికి ఇది పరాకాష్టగా పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. పెద్దపెద్ద భవంతులు, కోట్ల రూపాయల ఆస్తిప రులు, ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో సాక్షాత్కరించడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు. ఏకంగా ఓ మాజీ ప్రజాప్రతినిధి సతీమణి పేరిట ఇల్లు మంజూరు కావ డం వెలుగు చూడడంతో వెంటనే అధికారులకు వినతిపత్రం ఇచ్చి ఆ ఇంటిని రద్దు చేసు కొని చేతులు దులిపేసుకున్నారు.ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాకు అంటుకున్న అవినీతి కంపు ఎమ్మెల్యే గడ్డం వినోద్కు చుట్టుకుంది.
ఈ దందా స్థానిక ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుల కనుసన్నల్లోనే జరుగు తోందన్న విమర్శలు ఉన్నాయి. సదరు ప్రజా ప్రతినిధి అనుచరులు దళారీ పాత్ర వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారి నుంచి అధికారులకు సిగ్నల్ అందిన వారికే ఇల్లు మంజూరు. ఇదే విషయం పట్టణంలో కోడైకూస్తుంది.