24 February, 2026 | 7:16 PM

పసిపాప మరణానికి కారణమైన వారిపై హత్య నేరం కేసు పెట్టాలి

24-02-2026 05:27 PM

ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

ఖానాపూర్,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దళిత, రజక కుటుంబాలను అడ్డుకోవడంతోపాటు పసిపాపను తొక్కి చంపిన పెత్తందారులను హత్యా నేరం కింద వెంటనే అరెస్టు చేయాలని బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వారికి కొమ్ము కాసిన సీఐ, ఎస్ఐ పోలీసులను తక్షణమే విధుల నుండి తొలగించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్  బాణోత్ గోవింద నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

జాతరలో దర్శనం టికెట్ కు రసీదు ఇవ్వాలని అడిగినందుకు పెత్తందారులు దాడి చేసి కొట్టడమే కాకుండా, పసిపాపను కాలితో తొక్కి చంపిన ఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని అన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులను పక్కనపెట్టి పెత్తందారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధితులపై కేసు నమోదు చేయడం అప్రజా సామ్యమని అన్నారు. కేసు విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.