30 June, 2026 | 9:37 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ

19-04-2025 12:45 AM

సంఘీభావం తెలిపిన డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి 

గజ్వేల్, ఏప్రిల్ 18 : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు కు వ్యతిరేకంగా సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో శుక్రవారం తంజీముల్ మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ము స్లింల ర్యాలీకి డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మతిన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ముస్లింలకు కేటాయించిన భూములను కేంద్ర ప్రభుత్వం లాగేసుకోవాలని చూస్తుందని ఆరోపించారు. దేశంలోని భూములను సంస్థలను ఇద్దరు అమ్ముతున్నారని, మరో ఇద్దరు కొంటున్నారని ఆరోపించారు. వెంట నే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని అప్పటివరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు.