17 April, 2026 | 11:51 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ

19-04-2025 12:45 AM

సంఘీభావం తెలిపిన డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి 

గజ్వేల్, ఏప్రిల్ 18 : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు కు వ్యతిరేకంగా సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో శుక్రవారం తంజీముల్ మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ము స్లింల ర్యాలీకి డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మతిన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ముస్లింలకు కేటాయించిన భూములను కేంద్ర ప్రభుత్వం లాగేసుకోవాలని చూస్తుందని ఆరోపించారు. దేశంలోని భూములను సంస్థలను ఇద్దరు అమ్ముతున్నారని, మరో ఇద్దరు కొంటున్నారని ఆరోపించారు. వెంట నే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని అప్పటివరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు.