30 June, 2026 | 8:39 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

మురుగునీటి వీధి పరిష్కారం ఏది

19-04-2025 12:42 AM
  1. రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు 
  2. ఏడాదిగా స్పందించని మునిసిపల్ అధికారులు

గజ్వేల్, ఏప్రిల్ 18: రోడ్డుపైకి వచ్చి మరి మురుగునీరు ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆఫీసర్స్ కాలనీ ప్రాంత కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడి టోరియం వెనక వీధుల్లో మురికి కాలువలు లేకపోవడంతో ఇండ్ల నుండి వచ్చే మురుగునీరు అంతా రోడ్లపైనే ప్రవహిస్తుంది. గత ఏడాదిగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో పరిస్థితి అలాగే కొనసాగుతుంది.

మురుగునీరు వీ ధుల్లోనే ప్రవహిస్తుండడంతో ప్రాంతమంతా దుర్గంధం బెదజల్లుతూ దోమలకు ఆలవాలంగా మారింది. ప్రజలు ఏడాదిగా ఇబ్బం దులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తు న్నారు. వెంటనే తమ ప్రాంత సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.