calender_icon.png 1 May, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్వోఆర్‌పై అవగాహన ఉండాలి

01-05-2025 12:28:02 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంను, ఇందులో పొందుపరిచిన అంశాలను రైతులు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ (షాదిఖాన)లో భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహ న సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్‌డిఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత, తహసీల్దార్ రఫతుల్లా లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ద్వారా రైతులకు భూమిపై హక్కు, రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పిం చడం జరిగిందని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసే ముందు భూముల పూర్తి వివరాలతో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు సమగ్ర విచారణ జరి పి పట్టా చేయడం జరుగుతుందని తెలిపారు.

భూమి హక్కులు ఏ విధంగా సంక్ర మించినా ముటేషన్ చేసి రికార్డులో నమో దు చేయడం జరుగుతుందని, పాసు పుస్తకాలలో భూమి పటం నమోదు చేయడం జరుగుతుందని, భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, భూధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు మోసపూరితంగా హక్కు ల రికార్డులు మార్చి ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం వంటి అంశాలను పొందు పర్చడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక మండ లాన్ని ఎంపిక చేసి మండలంలోని అన్ని రకాల సమస్యలను తెలుసుకొని జూన్ 2వ తేదీ వరకు పరిష్కరించడం జరుగుతుందని, సంబంధిత పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని,మిగిలిన మండలాలలోని సమస్యలను గుర్తించి ఆగస్టు 15వ తేదీ లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికా రులు తదితరులు పాల్గొన్నారు.