04-10-2025 09:31:07 PM
రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు
నిజామాబాద్,(విజయక్రాంతి): ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు శనివారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ఏజెంట్ల నియామకం, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లచే అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో డీ ఎల్ పీ ఓ లు, ఆర్.ఓ లు, ఏ.ఆర్.ఓ లు పాల్గొన్నారు.