calender_icon.png 18 June, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసా పథకంలో నమోదు చేసుకోవాలి

18-06-2025 12:00:00 AM

మందమర్రి, జూన్ 17 : మండలంలోని నూతనంగా పట్టాదా ర్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకం లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి కోరారు. మండలంలోని సండ్రోన్ పల్లి రైతు వేదికలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని  ప్రారంభించిందని, గత యా సంగి నుంచి ఇప్పటి వరకు నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతు లు, ఇదివరకే పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది రైతు భరోసాలో నమోదు కానీ రైతు లు, బ్యాంక్ ఖాతా వివరాలు తప్పుగా నమో దు అయిన రైతులు ఈ నెల 20లోపు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్ లతో పాటు ఫోన్ నెంబర్ జత పరచి  రైతు వేదికలో విస్తరణ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని, మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని కోరారు.