13 May, 2026 | 4:04 PM

పోలీస్ స్టేషన్లో పరస్పర దాడులు

13-05-2026 02:57 PM

వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలు రాళ్లదాడులకు పాల్పడ్డాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ, ఓ వర్గం ఆందోళనకు దిగగా మరో వర్గానికి చెందిన వారు పోలీస్ స్టేషన్లో పరస్పర దాడులకు దిగారు. రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిల్ లో విసురు కోవడంతో పాటు పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్లోనే దాడులకు దిగిన సమయంలో పోలీసులు పెద్దగా లేకపోవడం వల్ల అదుపు చేసే పరిస్థితి లేక గందరగోళంగా మారింది.