ఉపకరణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
13-05-2026 03:18 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉపకరణాలను అందించారు. అంగవైకల్యంతో బాధపడుతున్న విద్యార్థులకు మొత్తం 208 మంది విద్యార్థులకు వివిధ ఉపకారణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.






