28-05-2025 01:06:30 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘భైరవం’. విజయ్ కనకడ మేడల దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహ న్ నిర్మిస్తున్నారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సిని మా ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ విలే కరులతో సమావేశమై చిత్ర విశేషాలను పంచుకున్నారు.
“నిర్మాత బెల్లం కొండ సురేశ్ ఈ కథ గురించి నాకు చెప్పా రు. ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. శశికుమార్ క్యారెక్టర్ గురించి చెప్తే.. తమిళంలో ‘గరుడన్’ చూశాను. ఆ సినిమాను రస్టిక్ విలేజ్ డ్రామాలాగా చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు. ఇందులో ప్రతి పాత్రకూ ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. వాస్తవంగా ఇది వెట్రిమారన్ కథ. కథలో ప్రతి పాత్రా కీలకంగా ఉంటుంది.
ఇందులో జయసుధ బామ్మ క్యారెక్టర్ చేశారు. ‘సార్ వచ్చారు’ తర్వాత ఆమెతో కలిసి పనిచేయడం ఆనందాన్నిచ్చింది. నేను యాక్షన్ సిని మాలు ఎక్కువ చేయలేదు. ఇది నాకో కొత్త అనుభవం. అందు కే ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నా.
డబ్బులు ఇచ్చి భయపడడం ఎందుకనీ (నవ్వుతూ)! నేను చిన్న బ్రేక్ తీసుకోవాలనుకుంటే అది కాస్తా పెద్ద బ్రేక్ అయింది (నవ్వుతూ). ఇకపై రెగ్యులర్గా నా సినిమాలు వస్తాయి. ‘సుందరకాండ’ దాదాపు పూర్తయింది.. జూలైలో రిలీజ్ ఉండొ చ్చు. నెక్స్ ఫిలిం ఆగస్టులో ప్రారంభించబోతున్నా” అని చెప్పారు.