20-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ 19 (విజయక్రాంతి): పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబ రాలు చేసుకున్నారు. పీసీసీ పరిశీలకులు అవేజ్, డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకు పార్టీలో సముచిత స్థానం కల్పించి వారి సంక్షేమానికి రాహుల్ గాంధీ పాటుపడుతున్నారని అన్నారు.
కార్యక్రమంలో టీపీ సీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్లు సోమా భీమ్ రెడ్డి ,అబ్దు ల్ హాది, మాజీ మునిసిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పట్టణ అధ్యక్షులు చిన్ను, మాజీ ఎంపీపీ లు కొరిపల్లి రామేశ్వర్ రెడ్డి ,పాల్దే అనిల్ ,మాజీ ఏఎంసీ దేవేందర్ రెడ్డి ,మాజీ ఎంపీపీ మాజీ కౌన్సిలర్లు నల్లూరి పోశెట్టి ,నరేందర్, నేరెళ్ల వేణు, గండ్రత్ రమణ, మం డల అధ్యక్షులు ఓడ్నాలా రాజేశ్వర్ ,సాగర్ రెడ్డి తక్కల, మధుకర్రెడ్డి ,దేవరకోట ఆలయ చైర్మన్ కొండా శ్రీనివాస్ ,సాయిబాబా ఆల య కమిటీ చైర్మన్ గంగోని బురాజ్ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో...
బెల్లంపల్లి అర్బన్, జూన్ 19: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాల యంలో కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి రాహుల్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిపారు. టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ సేవలను కొనియాడారు.
ఆయురారోగ్యాలతో కాంగ్రెస్ పార్టీ అధినేత పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు అమూల్యమైన సేవల ను అందించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ నాయకులు ఎం ఏ నయీమ్, రాష్ట్ర మహిళా నాయకురాలు రొడ్డ శారద,
మాజీ కౌన్సిలర్ గేల్లీ రాజలింగు, మైనార్టీ నాయకులు నిజాం, ఎస్సీ సెల్ నాయకులు రేగుల రాజలింగు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ సన్నీ బాబు, వైస్ ప్రెసిడెంట్ పోచంపల్లి హరీష్, పట్టణ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షుడు భూపెల్లి రాజేశ్వర్, మాజీ కౌన్సిలర్ కటకం సతీష్, చింతపండు శీను, కొమ్ము సురేష్, సీనియర్ నాయకులు మత్తమారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
లక్షెట్టిపేటలో..
లక్షెట్టిపేట, జూన్ 19: మున్సిపాలిటీ లోని స్థానిక విశ్రాంతి భవనంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం కాంగ్రెస్ నాయకులు మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ......
ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేసింది గాంధీ కుటుంబం అని కొనియాడారు. రాబోవు రోజుల్లో భారత ప్రధాని రాహుల్గాంధీ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మాజీ ఎంపిటీసీ వెంకట్ స్వామి గౌడ్, గుత్తికొండ శ్రీధర్, నవాబ్, అమీర్, హాజీ, రాజు,రవీందర్,గొపతి రమేష్, బుద్దె దేవా, రాకేష్, లచ్చన్న, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిలో...
మందమర్రి, జూన్ 19 : కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వ హించారు. పట్టణంలోని మార్కెట్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గురువారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కేకును కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, తుంగపిండి విజయ్, వీరన్న, మైనారిటీ నాయకులు ఎండి ఇషాక్, కొక్కుల మధుయూత్ కాంగ్రెస్ నాయకులు ఒజ్జ గణేష్, మహేష్, చోటు, రాజేష్, కిరణ్ సతీష్, చింటూ, పృథ్వీ పాల్గొన్నారు.