08-06-2025 12:00:00 AM
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మో హన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎపిక్ సోసల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా కింగ్ నాగార్జున ‘కుబేర’కు తన డబ్బింగ్ పూర్తి చేశారు.
ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, నిర్మాత పుష్కర్ రామోహన్ కలిసి మాట్లాడుతున్న ఫోటోలను మేకర్స్ సోషల్మీడియాలో షేర్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.