calender_icon.png 8 June, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరి హర వీరమల్లు.. పూర్తిగా నష్టపోయాం: టీఎఫ్సీసీ కార్యదర్శి శ్రీధర్

07-06-2025 09:37:52 PM

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్(Telangana State Film Chamber)కు సునీల్ నారంగ్ మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, కార్యదర్శులను ఎంపీ అనిల్ కుమార్ సన్మానించారు. కొత్త కార్యవర్గానికి నిర్మాతలు సురేశ్ బాబు, అభిషేక్ అగర్వాల్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్(TFCC Secretary Sridhar) కీలక వ్యాఖ్యలు చేశారు. సింగిల్ స్క్రీన్లలో పర్సెంటేజ్ విధానం కోసం 2016 నుంచి పోరాడుతున్నామని, సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని శ్రీధర్ పేర్కొన్నారు.

సికింద్రాబాద్ లోని ఆరు థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయని, పర్సెంటేజ్ విధానంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ను సంప్రదించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పర్సెంటేజ్ ఇవ్వకపోతే థియేటర్లు బంద్ చేస్తామని తము చెప్పలేదని, థియేటర్లు బంద్ అంశం తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిందని శ్రీధర్ వెల్లడించారు. తమ మద్దతు కోరితే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో చర్చించామని, థియేటర్లు బంద్ పై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఎవరికీ లేఖ ఇవ్వలేదన్నారు. ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు డైరెక్టర్ల వల్ల వివాదం ముదిరిందని, సమయం వచ్చినప్పుడు వారి పేర్లు చెప్పి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని శ్రీధర్ తెలిపారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం థియేటర్లను ఖాళీగా ఉంచామని, ఈనెల మొత్తం పూర్తిగా నష్టపోయామని తెలిపారు. ఒకప్పుడు హీరోలు ఏడాదికి 2,3 సినిమాలు చేసేవాళ్లు, కానీ ఇప్పడు ఒక్కో హీరో ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయట్లేదని వాపోయ్యారు. రూ.10 లక్షలు తీసుకునే హీరోకు తదుపరి సినిమాకు రూ.30 లక్షలు ఇస్తున్నారని, ఇటీవల ఒక సినిమా డిజాస్టర్ అయితే ఆ హీరోను పిలిచి రూ.13 కోట్లు ఇచ్చారు. హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేస్తే థియేటర్లు ఎలా నడుస్తాయని శ్రీధర్ వ్యాఖ్యానించారు.