15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

డిటిఎఫ్ మండల అధ్యక్షులుగా నాగయ్య, ప్రధానకార్యదర్శిగా వీరాంజనేయులు నియామకం

12-11-2025 10:39 PM

మోతె: డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మోతె మండల శాఖ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు పబ్బతి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. పిఆర్సిని వెంటనే ప్రకటించాలని పెండింగ్ డిఏలను మంజూరు చేయాలని అలాగే ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా డిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి కొచ్చర్ల వేణు జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద భాస్కర్ పాల్గొన్నారు.

ఎన్నికల అధికారిగా చెరుకు సింహాద్రి పరిశీలకులుగా పబ్బతి వెంకటేశ్వర్లు వ్యవహరించి ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. డిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులుగా ఆర్ నాగయ్య, ఉపాధ్యక్షులుగా అనంతుల వెంకన్న, చెకిలం కవిత,ప్రధాన కార్యదర్శిగా పి వీరాంజనేయులు ,కార్యదర్శి రాంబాబు, ఎం జానయ్య, బి శ్రీనివాసచారి, జిల్లా కౌన్సిలర్స్ గా చెరుకు సింహాద్రి , వనజ ,నాయకపు పరమేష్, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా గురిజాల రమేష్ సభ్యులుగా సిహెచ్ రాజేశ్వరి, క్రాంతి కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.