14 July, 2026 | 4:07 PM

Breaking News

ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •  

నమీబియా అధ్యక్షురాలిగా నంది

05-12-2024 02:26 AM

దేశ చరిత్రలో తొలిమహిళా అధ్యక్షురాలిగా గుర్తింపు

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఆఫ్రికా దేశాల్లో ఒకటైన నమీబియాలో నంది చరిత్ర సృష్టించారు. గతంలో దేశ ఉపరాష్ట్రపతిగా పని చేసిన ఆమె దేశాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడ్డ ఫలితాల ప్రకారం  స్వాపో(ఎస్‌డబ్ల్యూఏపీఓ) పార్టీకి చెందిన నంది న్డుత్వైనికి 57శాతం ఓట్లు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ పేట్రియాట్స్ ఫర్ చేంజ్ (ఐపీసీ) పార్టీకి చెందిన ఇటుల ఈ ఎన్నికల్లో కేవలం 26శాతం ఓట్లు మాత్రమే పొందారు.

అయితే ఈ ఎన్నికల ఫలితాలపై ఐపీసీ అనుమానం వ్యక్తం చేసింది. ఫలితాలను కోర్టులో సవాలు చేయనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం 72ఏళ్ల వయసున్న నంది 1960ల్లో స్వాపో పార్టీలో చేరి నమీబియా స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు. దక్షిణాఫ్రికా నుంచి 1990లో నమీబియా స్వాతంత్య్రం పొందింది.