14 July, 2026 | 4:04 PM

Breaking News

ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •  

దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

14-07-2026 03:31 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): ఆషాడమాసం శాకంభరీ ఉత్సవాలలో భాగంగా  అమావాస్యను పురస్కరించుకుని మంగళవారం కరీంనగర్‌ రూరల్ మండలం నగునూర్‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో దుర్గాభవానీ అమ్మవారికి ఆలయ ప్రధానార్చకులు పవనకృష్ణ శర్మ ఫలపంచామృతాభిషేకం, విశేష హారతులు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం శాకంభరీ ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తు ద్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం, చీరెసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్‌ చైర్మెన్‌ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులతోపాటు భక్తులు పాల్గొన్నారు.