14 July, 2026 | 3:22 PM

Breaking News

పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •  

బంగ్లాలో ఉగ్రదాడులకు అవకాశం

05-12-2024 02:22 AM

ట్రావెల్ అడ్వైజరీలో బ్రిటన్ ప్రభుత్వం ప్రకటన

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్ ప్రభుత్వం  తాజాగా ప్రకటించింది. బంగ్లాలో పర్యటించాలనుకునే బ్రిటన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వం తమ ట్రావెల్ అడ్వైజరీని సవరించింది. దేశంలోని కొన్ని మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేందుకు కుట్ర జరుగుగుతుందని తెలిపింది.

బంగ్లాలో తరచూ మైనార్టీలపై జరుగుతున్న దాడులే అందుకు నిదర్శనమని పేర్కొంది. అయితే, దాడులను అడ్డుకోవడానికి ఆ దేశ అధికారులు, భద్ర తా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలుపుతూ ఓ నోటీసు ను విడుదల చేసింది. కాగా, బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వీడిన తర్వాత అక్కడ హిందువులు, ఇతర మైనార్టీ వర్గాలపై తరచూ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.