calender_icon.png 9 December, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాసా కిట్ల అందజేత

09-12-2025 12:42:16 AM

కరీంనగర్ క్రైమ్ డిసెంబర్08(విజయక్రాంతి) స్థానిక బోయవాడ శ్రీ చైతన్య పాఠశాల లో నాసా ప్రాజెక్టులలో పాల్గొన్న విద్యార్థులందరికీ ముఖ్యఅతిథి ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా నాసా కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిం చి ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, పిల్లలు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందుం డేలా ప్రోత్సహించిన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా కోఆర్డినేటర్ ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ యొక్క కరీంనగర్ జోన్ లోనే 200 మంది పిల్లలు నాసా ప్రాజెక్టులలో పాల్గొంటున్నారని మరియు అన్ని జోన్లలో కూడా చాలా ఉత్సాహంగా నాసాలో పాల్గొంటున్నారని, ఇలాంటి విద్యార్థులకు శ్రీ చైతన్య యాజమా న్యం ఎప్పటికీ తోడు ఉంటుందని తెలిపారు.

మరియు పాఠశాల ప్రిన్సిపల్ న్యాలకొండ పద్మజా మాట్లాడతూ శాస్త్రీయపరంగా పిల్ల లు వారి యొక్క మేధాశక్తిని ఉపయోగిస్తూ మరెన్నో ప్రాజెక్టులు చేస్తూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఎం రాజు, డీన్ విజయకృష్ణ, నాసా ఇంచార్జ్ చంద్రకళ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.