02-07-2025 10:52:20 PM
సనత్ నగర్ (విజయక్రాంతి): విజయనగర్ కాలనీ బ్రాంచ్ నారాయణ పాఠశాల(Narayana School)లో విద్యార్థులు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు స్టెతస్కోప్, డాక్టర్ కోట్స్, డాక్టర్ కిట్లను ధరించి డాక్టర్ల వేషధారణలో వచ్చి అందరిని అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విరించి హాస్పిటల్(Virinchi Hospitals) పీడియాట్రిక్ వన్నెల రాజు విచ్చేసి విద్యార్థులకు ఆరోగ్యమే మహాభాగ్యం అనే అంశంపై అవగాహన కల్పించారు.
విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పౌష్టికాహారం వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నూరిన్ ఫాతిమా మాట్లాడుతూ... మన ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమించే వైద్యులను గౌరవించుకోవడానికి జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నామని వారి సేవలను గుర్తించి వారికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిఎం గోపాల్ రెడ్డి ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.