calender_icon.png 1 November, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం

01-11-2025 12:00:00 AM

మంచిర్యాల, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయం తిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఐబి చౌరస్తా వరకు రన్ ఫర్ యూనిటీ 2కె రన్ నిర్బహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ లు ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జిల్లా క్రీడా యువజన సర్వీసుల అధికారి హనుమంతరావు లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలందరినీ ఏకతాటి పైకి తీసుకువచ్చి జాతీయ సమైక్యతకు నిదర్శనంగా నిలిచిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని అన్నారు. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ, సాంస్కృతిక విభేదాలు లేకుండా ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని, భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.