10-06-2025 01:24:33 AM
అమరావతి ‘వేశ్యల రాజధాని’ అన్న వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదం
కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
వ్యవస్థీకృత కుట్ర: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి) : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరా వతిపై తాజాగా తలెత్తిన వివాదం అంతకంతకు పెరిగి రాజకీయంగా రాజుకుం టున్నది. ఇటీవల సాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు ఒక నివేదికను పేర్కొంటూ, అమరావతిని ‘వేశ్యల రాజధాని’గా వ్యాఖ్యానించడం వివాదాస్పద మైంది. ఆ కార్యక్రమానికి హోస్ట్గా కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహరిం చారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతిని ‘దేవతల రాజధాని’గా అభివ ర్ణించడానికి కౌంటర్గా జర్నలిస్ట్ కృష్ణంరాజు దానిని ‘వేశ్యల రాజధాని’గా పేర్కొన్నారు. దీనిపై ప్రజలు, రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో నివసించే అన్ని కులాల, మతాల మహిళ లను ఈ వ్యాఖ్యలు అవమానించాయని టీడీపీ నేతలు ఆరోపించారు. సాక్షి టీవీ యాజమాన్యంపై, కొమ్మినేని శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు.
అలాగే, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణంరాజు మాట్లాడిన మాటలను కొమ్మినేని అనుమతించడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ వివాదంపై చంద్రబాబు ప్రభు త్వం తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సాక్షి టీవీకి, సంబంధిత వ్యక్తులకు సమన్లు జారీ చేస్తున్నట్టు వెల్లడించారు.
అలాగే, మహిళా కమిషన్ ఈ అంశాన్ని సు మోటోగా తీసుకుని, విచారణ జరపనున్న ట్టు ప్రకటించింది. ఆ తర్వాత జర్నలిస్ట్ కృ ష్ణంరాజు జాడలేకుండా పోయారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోమవా రం సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్రావును ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసారు. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్ల్లూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వచ్చిన ఏపీ పోలీసులు ఆ యనను అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ ఇమేజ్ డ్యామేజ్..
వైసీపీ, సాక్షి టీవీ ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రకటించాయి. డిబేట్లో పాల్గొన్న వ్యక్తుల అభిప్రాయాలు తమవి కాదని సాక్షి టీవీ స్పష్టం చేసింది. అయితే వారు ఈ వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పడానికి ముందుకు రాకపోవడం మరిం త విమర్శలకు దారితీసింది. సాక్షి టీవీ యా జమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
వైసీపీ గ తంలోనూ అమరావతి రాజధాని విషయం లో విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాంత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరే కతను చవిచూసింది. ఈ తాజా వివాదం ఆ పార్టీ ఇమేజ్ను మరింత దెబ్బతీసింది.
నిరసనలు, ఫిర్యాదులు..
వివాదస్పద వ్యాఖ్యల కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక పోలీస్స్టేషన్లలో వీవీఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు ‘సాక్షి’ యాజమాన్యంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల ‘సాక్షి’ కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపా రు, పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక గత పాలకుల కుట్ర ఉందని, అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీయడమే వారి లక్ష్యమని కూటమి నేతలు ఆరో పించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నాయకులు హెచ్చరించారు. తుళ్లూరులో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమైన తరుణంలో వైసీపీ నాయకులు విషం చిమ్ముతున్నారని, రాష్ర్టం కోసం భూములు త్యాగం చేసిన తమను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ కమిషన్లకు ఫిర్యాదులు, చట్టపరమైన చర్యలు
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ విష యంపై జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ కిశోర్ రహాట్కర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్లకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. మీడియా బాధ్యతలను ఉల్లంఘించి, మహిళల గౌరవానికి భంగం కలిగించారని, వారి వివరణ కోరడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కోరారు.
రాష్ర్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ మాట్లాడుతూ జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస రావుతో పాటు సాక్షి ఛానెల్కు సమన్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు. అమరావతి ప్రాంతం దళిత నియోజకవర్గంలో ఉందని, దళిత మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయ డం దురదృష్టకరమని పేర్కొన్నారు.
వివాదానికి తెరలేపిన రిపోర్టు..
దేశంలోనే అత్యధిక మహిళా సెక్స్ వర్కర్లు కల్గిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు టాప్--5లో నిలిచినట్లు ఇటీవల ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ సంస్థ తన అధ్యయనంలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సెక్స్ వర్కర్లలో.. కర్ణాటకలో అత్యధికంగా 15.4 శాతం మంది మహిళలు వ్యభిరచారం చేస్తున్నట్లు గుర్తించారు.
ఆ తర్వాత ఏపీలో 12 శాతం, మహారాష్ర్టలో 9.6 శాతం, ఢిల్లీలో 8.9 శాతం, తెలంగాణలో 7.6 శాతం మంది మహిళలు తమ శరీరాన్ని అమ్ముకుంటూ జీవిస్తున్నట్లు తెలుసుకున్నారు. అంటే దేశంలోని మహిళా సెక్స్ వర్కర్లలో దాదాపు 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. భారత్లో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలే టాప్లో ఉన్నాయి. అయితే ఈ నివేదికలో ఎక్కడా అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ అని నిర్దుష్టంగా పేర్కొనలేదు.
వైసీపీ నేతల్లో మార్పు రాలేదు..
అమరావతి రాజధాని మహిళలపై సాక్షి ఛానల్లో అసభ్య వ్యా ఖ్యలను కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఖం డించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదన్నారు. వారు అమరావతి నగ రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.
విచారకరం: బాబు
సీఎం చంద్రబాబునాయుడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తన సొంత టీవీ ఛానెల్లో అమరావతి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరి చేలా వ్యాఖ్యలు చేసినా మాజీ సీఎం గా జగన్ ఖండించకపోవడం, క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. రాజకీయ కక్షతో మహిళల మనోభావాలను గాయపరిచిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతా న్ని, మహిళలను, బౌద్ధాన్ని అవమానించే కుటిల యత్నమిదని ఆరోపిం చారు. ఇవి వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించలేమని, ‘సాక్షి’ చానెల్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇలాంటి కుట్రలు చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. హోం మంత్రి వంగలపూడి అనిత స్పంది స్తూ.. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప రమైన చర్యలు తప్పవని, ఈ కుట్ర వెనుక ఉన్నవారి లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు.
దారుణం: వైఎస్ షర్మిల
అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి ఛానల్లో చర్చలు దారుణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమరావతి మహిళలకు సాక్షి టీవీ చైర్పర్సన్ భారతీరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మహిళలను అవమానించడంపై క్షమాపణ కోరితే సంతోషిస్తానని తెలిపారు. ప్రజాసమస్యలను విస్మరించిన మీడియా సంస్థగా సాక్షి చరిత్రకెక్కిందంటూ షర్మిల మండిపడ్డారు.
సాక్షి టీవీ డిబేట్లో..
కృష్ణంరాజు: ‘అమరావతి దేవతల రా జధాని అని పదేపదే చంద్రబాబు నాయు డు, పవన్ కల్యాణ్ గారు చెబుతున్నారు. కానీ, హిందూ దేవతలను ఆరా ధించే వారి ని కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉ న్నాయి. దేవతల రాజధాని అమరావతి ఎక్కడో పైన ఉంటుంది ఏదో ఇంద్రలోకమో ఇంకోటో. దాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన అమరావతిని దేవతల రాజధాని అని ఎట్లా అం టారండి?’
కొమ్మినేని శ్రీనివాసరావు: ‘మరీ అట్లా అనటం బాగోదేమో.. మళ్ళీ మీ మీద పడతారు’.
కృష్ణంరాజు: ‘ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉం ది. కానీ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్క డ ఉన్నారంటే, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు”.
కొమ్మినేని శ్రీనివాసరావు: ‘ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో, ది హిందూలోనో వచ్చింది. అ ది కరెక్టే కానీ, మనం తరచూ ఆ వార్తను రిఫర్ చేస్తే అసూయ అనో, ఇంకోటో.. కృ ష్ణం రాజుగారు కావాలని ఇట్లా అనో అట్లా అనో సోషల్ మీడియాలో మీ మీద నీచం గా ప్రచారం చేసే అవకాశం ఉంది’.
కృష్ణంరాజు: ‘వారు నీచంగా ప్రచారం చేస్తారు అన్నది మనకు అనవసరం. కానీ, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పలేకపోతే ఈ సమాజానికి మనం ద్రోహం చేసినట్లవుతుంది. వేశ్యా కేంద్రాలకు సంబంధించిన 150 స్వచ్ఛంద సంస్థలు అమరావతి చుట్టుపక్కల పనిచేస్తున్నాయి. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. ఈ సెక్స్ వర్కర్ల వల్ల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నారని, ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే వ్యక్తి నాకు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా అమరావతిని దేవతల రాజధాని అని చెప్పడం మానుకోవాలి.’
కృష్ణంరాజు: ‘దేవతలు అనే సరికి మళ్లీ ఇంకో సమస్య వస్తుంది. హిందూ దేవతలా, ముస్లిం దేవుడా, క్రైస్తవ దేవతలా అని.. కాబట్టి ఈ పనికిమాలిన పదాలను వాడకుండా ఉంటే మంచిది. పైగా ఈ దేవతల రాజధాని పేరుతో వారు అక్కడ అవి నీతి పనులకు పాల్పడవచ్చా? అక్కడ ఎప్పు డూ అవినీతి వార్తలు వస్తూనే ఉన్నాయి.’