వ్యవసాయ శాఖలో నూతన ఏఓల రాక
18-10-2024 08:04 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లా వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న స్థానాల్లో మండల వ్యవసాయ అధికారులు చేరికతో జిల్లా వ్యవసాయ శాఖ నిండుగా కనిపిస్తోంది. జిల్లాలోని చెన్నూర్ మండల వ్యవసాయ అధికారిగా యామిని, తాండూరుకు సుష్మా, భీమారానికి అత్తె సుధాకర్, కన్నెపల్లికి సాయి ప్రశాంత్, కోటపల్లికి సాయి కృష్ణా రెడ్డి, భీమినికి యమున దుర్గా, నెన్నెల మండల వ్యవసాయాధికారిగా సృజనలతో పాటు డీఏఓ కార్యాలయ టెక్నికల్ ఏవోలుగా ఫర్హాన్, తరుణ్ లు శుక్ర వారం బాధ్యతలు తీసుకున్నారు. ఖాళీల స్థానంలో ఏఓలు రావడంతో రైతులకు సాగులో మెరుగైన సలహాలు, సూచనలు అందనున్నాయి.






