16-02-2026 06:51:48 PM
ముత్తారం,(విజయక్రాంతి): జిల్లా యాదవ సంఘం, యాదవ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ముత్తారం మండల కేంద్రంలో నూతన సంవత్సర క్యాలెండర్ను మండలంలోని యాదవ సంఘం నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ ముత్తారం మండల అధ్యక్షులు కాసు తిరుపతి యాదవ్, మండల యువత అధ్యక్షులు చెల్కల యుగేందర్ యాదవ్, యాదవ సంఘం నాయకులు పాల్గొని క్యాలెండర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యాదవ సంఘం ఐక్యత,సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణ లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని, విద్య,ఉపాధి సేవా కార్యక్రమాల్లో పురోగతికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు మారేడుగొండ రాజన్న, బక్కతట్ల కుమార్, మండల ప్రధాన కార్యదర్శి, కేషనపల్లి ఉపసర్పంచ్ సింగనవేన సదయ్య, యాదవ సంఘం నాయకులు బక్కతట్ల కుమార్, నూనేటి కృష్ణ,తాత పొచమళ్ళు, రవికుమార్, మారేడుగొండ సమ్మయ్య, టి.తిరుపతి, పెద్ద రాజమల్లు, కిరణ్, రాజశేఖర్, దేవేందర్ లు పాల్గొన్నారు.