16-02-2026 06:55:41 PM
– తక్షణ చర్యలు కోరిన బీజేపీ నేతలు
సనత్నగర్,(విజయక్రాంతి): నేడు బి.కె.గూడాలోని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అమీర్పేట్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సమస్యలపై డిప్యూటీ కమిషనర్ సుజాతకి బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేకంగా బి.కె.గూడాలోని జై భారతి హై స్కూల్, క్రెసెంట్ కాన్వెంట్ స్కూల్ పాఠశాలల సమీపంలో వేగ నియంత్రణలు (స్పీడ్ బ్రేకర్లు) ఏర్పాటు చేయాలని కోరారు.
ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో విద్యార్థులకు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకుని వేగ నియంత్రణలను ఏర్పాటు చేయాలని డీసీ సుజాతని కోరినట్లు తెలిపారు. ఈ కరిక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల మహేష్, పెరుమాండ్ల నరేందర్ దశరథ్ గౌడ్, మల్లికార్జున, అనిల్ తదితరులు పాల్గొన్నారు.